News August 12, 2025
పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయం: టీడీపీ

AP: 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నిక వచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునేవాళ్లని టీడీపీ విమర్శించింది. ఈ సారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయడంతో ఆ చోట ఎన్నికలు వచ్చాయని Xలో తెలిపింది. కూటమి ప్రభుత్వం కారణంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని పేర్కొంది.
Similar News
News August 20, 2025
తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్!

ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు <<17458012>>లోక్సభలో<<>> ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
News August 20, 2025
రేపు చిరు అభిమానులకు సర్ప్రైజ్

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కాగా, ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా157 నుంచి రేపు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.
News August 20, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇవాళ APలో ఎక్కడా స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. TGలో మాత్రం ఒక్క నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా హాలిడే ఇచ్చారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా పాఠశాలలు నడవనున్నాయి. అయితే KMM, ములుగు, భూపాలపల్లి, ADB, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.


