News August 12, 2025
పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయం: టీడీపీ

AP: 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నిక వచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునేవాళ్లని టీడీపీ విమర్శించింది. ఈ సారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయడంతో ఆ చోట ఎన్నికలు వచ్చాయని Xలో తెలిపింది. కూటమి ప్రభుత్వం కారణంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని పేర్కొంది.
Similar News
News January 27, 2026
ఇవాళ సా.4 గంటలకు ఎన్నికల షెడ్యూల్

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
News January 27, 2026
కాల్పులు ఆపాలని పాక్ వేడుకుంది.. UNలో ఇండియా కౌంటర్

ఇండియాకు, ఇండియాలోని ప్రజలకు హాని కలిగించడమే పాక్ ఏకైక అజెండా అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ UN వేదికగా మండిపడ్డారు. ‘మే 10న కాల్పుల విరమణ కోసం పాక్ వేడుకుంది. మా ఆపరేషన్లో పాక్ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి’ అని చెప్పారు. ఇండియా చేపట్టిన OP సిందూర్కు తాము బదులిచ్చామంటూ UNSCలో పాక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
News January 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <


