News March 1, 2025

ఇది దేశంలోనే తొలిసారి: మంత్రి సత్యకుమార్

image

AP: దేశంలోనే తొలిసారిగా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 30yrs సేవల్లో ఉన్న వారికి గ్రాట్యూటీ కింద ₹1.50 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో 42,752 మంది వర్కర్లకు మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ₹10వేల వేతనం ఇస్తున్నామని, రెండు కాన్పులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 1, 2025

ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

image

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

News March 1, 2025

కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్‌పోర్ట్: సీఎం

image

TG: వరంగల్(D) మామునూరు విమానాశ్రయం కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు తరహాలో ఉండాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. నిత్యం రాకపోకలతో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 1, 2025

ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

image

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్‌ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.

error: Content is protected !!