News April 24, 2024
12 ఏళ్లలో ఇదే తొలిసారి

లోక్సభ ఎన్నికల్లో సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముకేశ్ దలాల్ అరుదైన ఘనత సాధించారు. గత 12 ఏళ్లలో ఇలా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీగా నిలిచారు. దీంతో 1951 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరింది. చివరిసారిగా 2012లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


