News December 21, 2024
శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..

శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. చలికాలంలో బాదం, కాజు, వాల్నట్స్, ఖర్జూరాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెయ్యి, తేనె శరీరంలో వేడి పుట్టిస్తాయి. జొన్నలు, రాగులు తీసుకోవడం మంచిది. బెల్లం నువ్వుల లడ్డూ, పసుపు, గుడ్లు, చికెన్ తీసుకుంటే త్వరగా జీర్ణం కాక శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది.
Similar News
News September 21, 2025
అత్తా కోడళ్లకు ఎందుకు పడదంటే?

అత్తాకోడళ్లంటే ఒకే ఒరలో రెండు కత్తులని అందరూ భావిస్తారు. దీనికి కారణాలు అనేకం. భర్త తన సొంతం అని కోడలు అనుకుంటుంది. కొడుకును తన దగ్గర్నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్లో చూస్తుంది. పోటీ తత్త్వం, అసూయ, ప్రాథమిక కారణాలు అని సైకాలజిస్ట్లు అంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య ఓపెన్నెస్ ఉంటే చాలా సమస్యలు సమసిపోతాయని సూచిస్తున్నారు.
News September 21, 2025
‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్న తెలుగువాళ్లు వీరే!

మోహన్లాల్ను ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వరించిన నేపథ్యంలో గతంలో ఈ అవార్డు అందుకున్న తెలుగు వారెవరో తెలుసుకుందాం. BN రెడ్డి(1974) దక్షిణాది నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. తర్వాత LV ప్రసాద్(1982), B.నాగిరెడ్డి(1986), ANR(1990), రామానాయుడు(2009), K విశ్వనాథ్(2016) అందుకున్నారు. దక్షిణాదిలో వీరితో పాటు రజినీకాంత్, బాలచందర్, గోపాలకృష్ణన్, శివాజీ గణేషన్, రాజ్కుమార్కు దక్కింది.
News September 21, 2025
వరిలో సుడిదోమ విజృంభణ.. లక్షణాలు

* అధికంగా నత్రజని ఎరువులను వాడటం, పొలంలో ఎక్కువగా నీరు నిల్వచేయడం వల్ల సుడి దోమ విజృంభిస్తుంది.
* నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువ విత్తనాలను చల్లడం, పైరు తొలి దశలో పురుగు మందులను ఎక్కువగా వాడటంతో మిత్ర కీటకాల సంఖ్య తగ్గి దోమ తీవ్రత పెరుగుతుంది.
* దోమలు వరి మొదళ్ల వద్ద చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. చివరగా తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.
<<-se>>#PADDY<<>>