News February 6, 2025
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఈయనే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738822735079_746-normal-WIFI.webp)
ఫ్రాన్స్కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్ని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గుర్తించారు. మాథ్యూపై విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు అతని పుర్రెకు 256 సెన్సార్లు బిగించి 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆయన ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ చార్టుల నుంచి గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
Similar News
News February 6, 2025
‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734357735912_367-normal-WIFI.webp)
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
News February 6, 2025
SBI ఆదాయం ₹1.28L CR, లాభం ₹16K CR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737378260393_893-normal-WIFI.webp)
డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన SBI నికర లాభం రూ.16,791 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,164 కోట్లతో పోలిస్తే ఇది 84% పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,18,193 కోట్ల నుంచి రూ.1,28,467 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్ల నుంచి రూ.1,17,427 కోట్లకు ఎగిసింది. గ్రాస్ NPA 2.42 నుంచి 2.07, నెట్ NPA 0.64 నుంచి 0.53 శాతానికి తగ్గాయి.
News February 6, 2025
పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736716570059_1226-normal-WIFI.webp)
TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.