News June 14, 2024

ఇటలీలో మోదీకి భోజనం అందించే హోటల్ ఇదే!

image

జీ7 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి బారీలో ఉన్న ‘నమస్తే ఇండియా’ రెస్టారెంట్ ఆయనకు ఆహారాన్ని ఏర్పాటు చేయనుంది. నోరూరించే భారత వంటకాలకు ఈ హోటల్ ప్రసిద్ధి. శాకాహార భోజన తయారీలోనూ మంచి పేరుండటంతో, మోదీకి భోజనాన్ని అందించే బాధ్యతల్ని దీనికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 13, 2025

రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

image

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ ముందుగా కండీషనర్‌ అప్లై చేసి, తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్‌, సిలికాన్‌ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.

News September 13, 2025

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు

image

తిరుపతి వేదికగా ఈనెల 14, 15 తేదీల్లో మహిళా సాధికారత జాతీయ సదస్సు జరగనుంది. తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. ఇందులో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారత-పెరుగుతున్న అవకాశాలు, ‘నాయకత్వం, చట్టాల్లో మహిళల పాత్ర’పై వక్తలు ప్రసంగించనున్నారు.

News September 13, 2025

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విజిలెన్స్‌కు ACB రిపోర్ట్

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశముంది.