News November 22, 2024
ఇది రాబందు రాజ్యం: KTR

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. ‘బడిమెట్లు ఎక్కిన బాల్యాన్ని ఆస్పత్రిలో చావు అంచున నిలిపినవ్. ఇది పేదల పిల్లలను పొడుచుకుతింటున్న రాబందు రాజ్యం. విషమ పరిస్థితిలో ఓ బిడ్డ 20 రోజులుగా తల్లడిల్లుతుంటే కనీసం పరామర్శించాలనే సోయి లేని సన్నాసి ప్రభుత్వమిది. ఈ విద్యార్థుల కన్నీళ్లు.. నీ రాక్షస పాలనకు సమాధిని నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 18, 2026
HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్కి టాటా చెప్పేసి GEN Z ఇన్స్టా రీల్స్లోనే బిర్యానీ అడ్రస్లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్పై మీరేమంటారు?
News February 18, 2026
సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్సీక్కు పోటీగా

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.
News February 18, 2026
మరోసారి భారత్ vs పాక్?

పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై కావడంతో T20WCలో మరోసారి భారత్తో తలపడే అవకాశం ఉంది. భారత్ గ్రూప్-1, పాక్ గ్రూప్-2లో ఉండటం వల్ల సూపర్-8లో అది సాధ్యం కాదు. కానీ సూపర్-8లో గ్రూప్-1లో భారత్ ఫస్ట్, గ్రూప్-2లో పాక్ సెకండ్ వస్తే సెమీస్లో తలపడొచ్చు. భారత్ సెకండ్, పాక్ ఫస్ట్ వచ్చినా సాధ్యమే. ఒకవేళ రెండు జట్లు వేర్వేరు సెమీస్లో నెగ్గితే కొలంబో వేదికగా IND vs PAK ఫైనల్ చూసే ఛాన్స్ ఉంటుంది.


