News July 5, 2024
ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164733135-normal-WIFI.webp)
జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.
Similar News
News July 8, 2024
కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720933707-normal-WIFI.webp)
TGలో కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. 35 మందిని నియమిస్తూ మార్చి 15నే జీవో రిలీజ్ చేయగా, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆగిపోయాయి. విత్తనాభివృద్ధి- అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం- మోహన్ రెడ్డి, కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్- జంగా రాఘవ్ రెడ్డి, ఫిషరీస్ సొసైటీస్- మెట్టు సాయి కుమార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్గా కాసుల బాలరాజును నియమించింది.
News July 8, 2024
అమానవీయం: ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720417339069-normal-WIFI.webp)
AP: బాపట్ల(D) చీరాల మం. కొత్తపాలెంకు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 20 రోజుల క్రితం భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలి వారం క్రితం ప్రసవించింది. అప్పటికే ఓ ఆడబిడ్డ ఉండగా రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో కుసుమాంజలి పోలీసులను ఆశ్రయించింది.
News July 8, 2024
శాంసంగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్ట్రైక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720414605861-normal-WIFI.webp)
సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద స్ట్రైక్కు తెరతీశారు. యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.