News March 18, 2025

IPLలో అత్యధిక ఫోర్లు కొట్టింది ఇతనే!

image

17 సీజన్లుగా ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPLలో వందల కొద్దీ రికార్డులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటి వరకు అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల గురించి తెలుసుకుందాం. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్‌ది. ఈయన 222 మ్యాచుల్లో 768 ఫోర్లు కొట్టారు. డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, హైదరాబాద్ జట్ల తరఫున ఆడారు. అతని తర్వాత కోహ్లీ(705), వార్నర్(663), రోహిత్(599), రైనా (506) ఉన్నారు.

Similar News

News March 19, 2025

TODAY HEADLINES

image

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం

News March 19, 2025

నెల రోజులపాటు గ్రామ గ్రామాన సంబరాలు: టీపీసీసీ చీఫ్

image

TG: BC కులగణన, SC వర్గీకరణపై రాష్ట్రమంతటా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘అసెంబ్లీలో BC కులగణన, SC వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో నెల రోజులపాటు సంబరాలు నిర్వహించాలి. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి’ అని తెలిపారు.

News March 19, 2025

నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

image

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.

error: Content is protected !!