News December 20, 2024
అత్యధిక వ్యూస్ కలిగిన యూట్యూబ్ ఛానల్ ఇదే!

యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లను మిస్టర్ బీస్ట్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అత్యధిక వ్యూస్ మాత్రం టీసిరీస్ ఛానల్ కలిగి ఉంది. ఇందులోని వీడియోస్కు మొత్తం కలిపి 259.4 బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత ‘కోకోమిలన్- నర్సరీ రైమ్స్’కు 184.7 బిలియన్ వ్యూస్, ‘సెట్ ఇండియా’కు 165.8B, ‘SONY SAB’కి 116.2B, కిడ్స్ డయానా షోకి 104.1B, LIKE NASTYAకి 101.6B, ZEE TVకి 91 బిలియన్ వ్యూస్ వచ్చాయి.
Similar News
News November 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షల్లో బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని OMR షీట్లు) విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. బ్లాంక్ బార్ కోడ్ వల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
News November 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షల్లో బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని OMR షీట్లు) విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. బ్లాంక్ బార్ కోడ్ వల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
News November 26, 2025
వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.


