News July 8, 2024

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ ఇదే..

image

✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్‌ కీ: అక్టోబర్‌ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్‌ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న

Similar News

News October 6, 2024

YCP ప్రభుత్వంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల

image

AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

News October 6, 2024

3 రోజుల్లో రూ.27వేల కోట్లు వెనక్కి

image

ఫారిన్ ఇన్వెస్టర్లు చివరి 3 సెషన్లలోనే రూ.27,142 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ ఏషియాలో వార్, క్రూడాయిల్ ధరలు, చైనా మార్కెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణాలు. స్టిమ్యులస్ ప్యాకేజీ, మానిటరీ పాలసీతో చైనా మార్కెట్లు గత నెల్లో 26% ఎగిశాయి. అక్కడి షేర్ల విలువ తక్కువగా ఉండటంతో FPIలు డబ్బును అక్కడికి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. CY24 SEP నాటికి వీరి పెట్టుబడులు రూ.57,724 కోట్లకు చేరాయి.

News October 6, 2024

క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే నిలిచిన SAARC: జైశంకర్

image

ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.