News November 22, 2024

దేశంలో టెలికం యూజర్ల సంఖ్య ఇలా!

image

టెలికం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. BSNL తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. Jio యూజర్లు 47.7 కోట్లు, Airtel యూజర్లు 28.5 కోట్లు, Vodaphone Idea యూజర్లు 12.26 కోట్లు, BSNL యూజర్లు 3.7 కోట్లు.

Similar News

News December 21, 2025

ఫ్యూచర్ సిటా? తోక సిటా?: కేసీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఫార్మా సిటీ కోసం భూమి తీసుకున్నాం. దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. విద్యార్థులను సాకలేని మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? అది ఫ్యూచర్ సిటా? తోక సిటా? వనతార అంటూ జూపార్కును అమ్మేస్తారా? ఈ ప్రభుత్వంలో దిక్కుమాలిన పాలసీలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలే కనిపిస్తున్నాయి’ అని ఫైరయ్యారు.

News December 21, 2025

RTCలో ఉచిత ప్రయాణానికి స్పెషల్ కార్డులు: భట్టి

image

TG: మహాలక్ష్మి స్కీమ్‌తో RTC లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్‌ బకాయిలు ఉండొద్దని సూచించారు.

News December 21, 2025

టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

image

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.