News November 22, 2024

దేశంలో టెలికం యూజర్ల సంఖ్య ఇలా!

image

టెలికం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. BSNL తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. Jio యూజర్లు 47.7 కోట్లు, Airtel యూజర్లు 28.5 కోట్లు, Vodaphone Idea యూజర్లు 12.26 కోట్లు, BSNL యూజర్లు 3.7 కోట్లు.

Similar News

News December 10, 2025

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

News December 10, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి DEC 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI)లో అసోసియేట్ మెంబర్ అయి ఉండటంతో పాటు ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.powergrid.in

News December 10, 2025

ప్రయాణికుల ప్రైవేట్ వీడియోలు తీసి..

image

ప్రయాణికుల ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన UPలో జరిగింది. కొత్తగా పెళ్లైన జంట పూర్వాంచల్ హైవేపై కారులో రొమాన్స్ చేస్తుండగా స్థానిక టోల్‌ప్లాజా సిబ్బంది అశుతోష్ సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తర్వాత వీడియో చూపించి వారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. మనీ ఇచ్చినా వీడియోను SMలో వైరల్ చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైట్ ఇవ్వగా అశుతోష్ అలాంటి వీడియోలెన్నో రికార్డ్ చేసినట్లు తేలింది.