News November 22, 2024
దేశంలో టెలికం యూజర్ల సంఖ్య ఇలా!

టెలికం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. BSNL తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. Jio యూజర్లు 47.7 కోట్లు, Airtel యూజర్లు 28.5 కోట్లు, Vodaphone Idea యూజర్లు 12.26 కోట్లు, BSNL యూజర్లు 3.7 కోట్లు.
Similar News
News December 11, 2025
మేడిగడ్డ భద్రత, రిపేర్లపై NDSA సమీక్ష

TG: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ హైదరాబాద్లో ఉన్నత నీటిపారుదల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆనకట్టల భద్రతకు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తున్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం అథారిటీ చేసిన సిఫార్సుల అమలుపై కూడా ఆయన సమావేశంలో చర్చిస్తున్నారు. కాగా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రభుత్వం ఇప్పటికే అథారిటీకి నివేదిక అందించింది.
News December 11, 2025
నిద్రలో పేరెంట్స్ నిర్లక్ష్యం.. పసికందు కన్నుమూత

తల్లిదండ్రులు నిద్రలో ఒరగడంతో 26 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన UPలో జరిగింది. తమ బిడ్డ సూఫియాన్ను తల్లిదండ్రులు మంచంపై మధ్యలో పెట్టుకుని పడుకున్నారు. నిద్రమత్తులో ఇద్దరు బేబీవైపు తిరగడంతో శిశువు మధ్యలో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయాడు. ఉదయం పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నించగా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. పేరెంట్స్.. జాగ్రత్త.
Share It
News December 11, 2025
ఒకే రోజు.. ఇటు హీరో, అటు విలన్!

ఆది పినిశెట్టి నటించిన ‘అఖండ-2’, ‘డ్రైవ్’ సినిమాలు ఒకే రోజున(DEC 12) రిలీజ్ అవుతున్నాయి. ‘అఖండ-2’లో మంత్రగాడిగా విలన్ రోల్లో, ‘డ్రైవ్’ మూవీలో హ్యాకింగ్ బారిన పడిన మీడియా దిగ్గజంగా నటించారు. రెండు సినిమాల్లోని పాత్రలకు, గెటప్లకు అసలు పోలికే లేదు. ఒకే వ్యక్తి ఇటు హీరోగా, అటు విలన్గా నటించిన సినిమాలు ఇలా ఒకే రోజున విడుదలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి ఆది డబుల్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.


