News November 23, 2024
దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే

దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడతాయి. రాష్ట్రంలో ఎన్ని టూరిజం స్పాట్లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్పో రైల్వే స్టేషన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
Similar News
News November 12, 2025
VKB: స్కూల్లో విద్యార్థికి విద్యుత్ షాక్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 12, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 12, 2025
ఢిల్లీ పేలుడు.. అల్ ఫలాహ్లో మరో డాక్టర్ మిస్సింగ్?

ఢిల్లీ <<18253549>>పేలుడు<<>>కు సంబంధించి అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన మరో డాక్టర్ పేరు బయటికొచ్చింది. బ్లాస్ట్ తర్వాత డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇతడు గతంలో కశ్మీర్లోని SMHS ఆస్పత్రిలో పని చేశాడు. అయితే టెర్రర్ లింక్స్ ఉన్నాయనే అనుమానంతో 2023లో J&K లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించడం గమనార్హం. ఆ సమయంలో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అల్ ఫలాహ్ వర్సిటీలో నిసార్ జాయిన్ అయ్యాడు.


