News June 23, 2024

రూ.వెయ్యి లీజుతో చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసె ఇదే: వైసీపీ

image

AP: చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు కడితే జగన్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని TDP <>విమర్శించింది<<>>. దీనికి వైసీపీ Xలో కౌంటరిచ్చింది. ‘రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని TDP హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని CBN కట్టుకున్న పూరి గుడిసె ఇదే! ఈ స్థలం 99ఏళ్లు TDPకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు ప్రతి జిల్లాలో కాజేశారు’ అని ఆరోపించింది.

Similar News

News December 18, 2025

గ్యాప్ ఉన్నా ఔటా? Snicko టెక్నాలజీపై రగిలిపోతున్న ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్‌ను ఔట్‌గా పరిగణించిన విధానంపై కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్ బ్యాట్‌కు, బంతికి మధ్య గ్యాప్ ఉన్నా.. స్నికో మీటర్‌లో స్పైక్ రావడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా పరిగణించారు. ‘స్నికోను తొలగించాలి. ఇది ఓ చెత్త టెక్నాలజీ’ అంటూ స్టార్క్ కూడా మండిపడ్డారు. అంతకుముందు అలెక్స్ కేరీ విషయంలోనూ ఇలాగే జరిగింది.

News December 18, 2025

AILET ఫలితాలు విడుదల

image

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్(AILET) ఫలితాలు విడుదలయ్యాయి. https://nationallawuniversitydelhi.in/లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రఖ్యాత నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల B.A.LL.B.(Hons.), ఏడాది LL.M. కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 14న ఈ పరీక్ష జరిగింది. దాదాపు 26వేల మంది హాజరయ్యారు. ఈ వర్సిటీలో క్లాట్, ఎల్ శాట్ స్కోర్లతో అడ్మిషన్ లభించదు.

News December 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 100 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఏ రాక్షస రాజు తన తపస్సు ద్వారా మహావిష్ణువును మెప్పించి, తన శరీరం అన్ని తీర్థాల కంటే పవిత్రంగా ఉండాలనే వరం పొందాడు? చివరికి విష్ణువు పాదం మోపడం ద్వారా ఆ అసురుడు ఏ పుణ్యక్షేత్రంగా మారాడు?
సమాధానం: రాక్షస రాజు గయాసురుడు తన తపస్సు ద్వారా విష్ణువును మెప్పించాడు. ఆయన శరీరంపై విష్ణువు పాదం మోపడం వలన అది ప్రసిద్ధ గయ పుణ్యక్షేత్రంగా మారింది.
<<-se>>#Ithihasaluquiz<<>>