News December 3, 2024
మార్కెట్లలో వరుస లాభాలకు కారణం ఇదే!

దేశీయ స్టాక్ మార్కెట్లు గత మూడు సెషన్లలో వరుసగా లాభాలను అర్జించాయి. ఎఫ్ఐఐలు తమ డిజిన్వెస్ట్మెంట్కు బ్రేక్ ఇవ్వడంతో సూచీలు మంగళవారం దూసుకుపోయాయి. ఎఫ్ఐఐలు రూ.3,664 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సెంటిమెంట్ను బలపరిచినట్టైంది. అదే సమయంలో డీఐఐలు రూ.250 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అధిక వెయిటేజీ రంగాలకు లభించిన కొనుగోళ్ల మద్దతు లాభాలకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News February 2, 2026
అజిత్ మృతి అనుమానాస్పదమే: MP సంజయ్

దివంగత MH Dy CM అజిత్ పవార్ మరణంపై శివసేన MP సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తుంటే విమాన ప్రమాదం సందేహాస్పదంగా ఉందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. NCP 2వర్గాల విలీనానికి BJP ఒక అడ్డంకి అని ఆరోపించారు. ఈ తరుణంలోనే అజిత్ లాంటి నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
News February 2, 2026
ఆన్లైన్ వేధింపులు ఎలా ఎదుర్కోవాలంటే?

టెక్నాలజీ పెరిగే కొద్దీ డిజిటల్ ప్రపంచంలో మోసాలూ, మహిళలపై వేధింపులూ పెరుగుతున్నాయి. ఈ విషవలయంలో అతివలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. తెలిసినవారేనని ఫొటోలు, వీడియోలు పంపకూడదు. పాస్వర్డ్లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. థర్డ్పార్టీ యాప్స్తో జాగ్రత్తగా ఉండాలి. వెబ్క్యామ్ను ఎప్పుడూ ఆఫ్ చేసి ఉంచండి. సైబర్ నేరాల బాధితులైతే సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930కి డయల్ చేయండి.
News February 2, 2026
డబుల్ లవ్.. డబుల్ జాయ్: చెర్రీకి అల్లు అర్జున్ కంగ్రాట్స్

<<19016319>>కవలలకు<<>> జన్మనిచ్చిన రామ్ చరణ్-ఉపాసనకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మరోసారి తల్లిదండ్రులుగా మారినందుకు కంగ్రాట్స్. చిరంజీవి, చిట్టిక(క్లీంకార) ముఖంలో ఆనందం వెల్లివిరిస్తోంది. ఫ్యామిలీని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ట్విన్స్ ఈ ప్రపంచంలోకి వస్తూనే ఎంతో ఆనందాన్ని తెచ్చారు. డబుల్ లవ్.. డబుల్ జాయ్’ అని ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.


