News October 1, 2024

Paytm షేరు ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణం ఇదే!

image

Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేరు ధ‌ర‌ సోమవారం సెష‌న్‌లో 6.25% పెరిగి రూ.731కి చేరింది. డోలాట్ క్యాపిటల్ సంస్థ‌ Paytmకు Buy రేటింగ్ ఇవ్వ‌డంతో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ప్ర‌స్తుత స్టాక్ ధ‌ర‌ను 30% పెంచి రూ.920 టార్గెట్ ప్రైస్‌గా నిర్ణ‌యించింది. Paytm హ్యాండిల్ మైగ్రేష‌న్ పూర్తి స‌హా పేమెంట్ అగ్రిగేట‌ర్ లైసెన్స్‌కు ఎఫ్‌డీఐ అనుమతి వంటివి సానుకూల కార‌ణాలుగా చూపింది.

Similar News

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతాన్ని ఎందుకు చేస్తారు?

image

ఏడు శనివారాల వ్రతాన్ని ప్రధానంగా శని గ్రహ దోషాల నివారణ కోసం చేస్తారు. అలాగే ఏడు కొండలవాడైన వేంకటేశ్వరస్వామి దయను పొందడం కోసం ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే.. ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు పోతాయని నమ్మకం. వ్రత ప్రభావంతో అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయని భావిస్తారు. వ్రతం పూర్తయ్యాక ముడుపును తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకుంటే కష్టాలు కొండెక్కిపోతాయని ప్రగాఢ విశ్వాసం.

News November 22, 2025

100kgల సమీకృత దాణా తయారీకి ఇవి అవసరం

image

☛ మొక్కజొన్న/జొన్న గింజలు-30kgలు
☛ వేరుశనగ చెక్క- 15kgలు ☛ పత్తి గింజల చెక్క-15kgలు
☛ వరి తవుడు/గోధుమ తవుడు – 20kgలు
☛ నూనె తీసిన తవుడు – 17kgలు
☛ ఖనిజ లవణ మిశ్రమం – 2kgలు
☛ ఉప్పు/లవణం – 1 కిలో
పైన సూచించిన పరిమాణంలో పదార్థాలతో సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ, వినియోగంలో ఒకసారి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News November 22, 2025

నౌహీరా షేక్ రూ.19.64 కోట్ల ఆస్తి వేలం

image

TG: హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ అక్రమార్జన కేసులో ED కీలక చర్యలు చేపట్టింది. ఆమెకు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఆస్తిని వేలం వేసి విక్రయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. నౌహీరా షేక్ అధిక లాభం ఇస్తామంటూ ప్రజల నుంచి రూ.5,978 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసగించారు. ఇప్పటివరకు రూ.428 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.