News March 16, 2024

రెండో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదే..

image

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 4 నెలలు(OCT 25, 1951 నుంచి FEB 21, 1952 వరకు) సాగింది. ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఈ ఏడాది జరగనున్నాయి. APR 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజులు ప్రక్రియ కొనసాగనుంది. 1962 నుంచి 1989 మధ్య 4-10 రోజుల్లో ఎన్నికలు ముగిశాయి. అత్యల్పంగా 1980లో జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల్లోనే పూర్తయ్యాయి. 2004లో 21 రోజులు, 2009లో 30, 2014లో 36, 2019లో 39 రోజులు జరిగాయి.

Similar News

News October 22, 2025

TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

image

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.

News October 22, 2025

డీఏ జీవోలో మార్పులు

image

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.

News October 22, 2025

అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం లేదా?

image

సరైన నిద్ర లేకుంటే శరీరం అధిక కేలరీల ఆహారం కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక నీరసంగా అనిపించి రోజంతా చురుకుగా ఉండలేరు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
Share it