News April 25, 2024

‘ముస్లిం కోటా’ స్టోరీ ఇదే – 1/3

image

కాంగ్రెస్ దేశంలో ‘ముస్లిం కోటా’ అమలుకు ప్రయత్నించిందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలకు రిజర్వేషన్ అనే అంశం తొలిసారిగా 1993-94లో నాటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వెలుగు చూసింది. ముస్లింలలోని 14 వర్గాలకు 5% రిజర్వేషన్‌ను కేటాయించనున్నట్లు 1994 ఆగస్టులో GO వచ్చింది. కానీ 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా ఓడిపోవడంతో అది అమలులోకి రాలేదు. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 25, 2025

ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

image

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్‌పై దృష్టి పెట్టాలన్నారు.

News November 25, 2025

ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.

News November 25, 2025

డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్వేలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సికింద్రాబాద్ రీజియన్‌లో 396 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు రూ.250 చెల్లించాలి. *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.