News October 11, 2024
ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఇదే: ఏకంగా కి.మీపైనే!

సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్, లోఖండ్వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.
Similar News
News December 16, 2025
పిల్లల ముందు గొడవ పడితే..

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్రప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు ఉంటే పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని ఆస్ట్రేలియాలో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
News December 16, 2025
‘నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా <<18564673>>అడ్డుకున్న<<>> అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను అతని బంధువు ముస్తఫా మీడియాకు వెల్లడించారు. ‘నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నా. నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’ అని చెప్పి అహ్మద్ వెళ్లాడని తెలిపారు. తన కొడుకు నిజమైన హీరో అని, అతనిని చూసి గర్విస్తున్నట్లు తండ్రి చెప్పారు.
News December 16, 2025
BBCపై పరువునష్టం దావా వేస్తా: ట్రంప్

ప్రముఖ మీడియా సంస్థ BBCపై పరువునష్టం దావా వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ ఘటనకు ముందు చేసిన తన ప్రసంగాన్ని BBC తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీబీసీ ఛైర్మన్ సమీర్ షా ఖండిస్తూ ట్రంప్కు క్షమాపణ లేఖ పంపారు. గతంలోనూ పలు మీడియా సంస్థలపై ట్రంప్ పరువునష్టం దావా వేశారు.


