News March 17, 2024

కవితను కలిసేందుకు కోర్టు నిర్ధారించిన టైమ్ ఇదే

image

TG: ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సీబీఐ కోర్టు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సా.6 నుంచి సా.7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇవాళ ఆమెను భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిన్న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News November 16, 2025

లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.

News November 16, 2025

పెరుగుతో అందం పెంచేయండి..

image

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.

News November 16, 2025

అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

image

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.