News September 16, 2024
లాభాలు తెచ్చిన రైలు ఇదే!

సురక్షితంగా, తక్కువ ధరతో గమ్యస్థానాన్ని చేరేందుకు ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, ఏ ట్రైన్ ద్వారా గతేడాది రైల్వేశాఖకు అధిక లాభాలొచ్చాయో తెలుసా? హజ్రత్ నిజాముద్దీన్ – KSR బెంగళూరు మధ్య నడిచే బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ (22692) 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. 5,09,510 మంది ఈ రైలులో ప్రయాణించగా రూ.1,76,06,66,339 వచ్చాయి.
Similar News
News November 25, 2025
12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.
News November 25, 2025
T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.
News November 25, 2025
అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.


