News September 16, 2024
లాభాలు తెచ్చిన రైలు ఇదే!

సురక్షితంగా, తక్కువ ధరతో గమ్యస్థానాన్ని చేరేందుకు ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, ఏ ట్రైన్ ద్వారా గతేడాది రైల్వేశాఖకు అధిక లాభాలొచ్చాయో తెలుసా? హజ్రత్ నిజాముద్దీన్ – KSR బెంగళూరు మధ్య నడిచే బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ (22692) 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. 5,09,510 మంది ఈ రైలులో ప్రయాణించగా రూ.1,76,06,66,339 వచ్చాయి.
Similar News
News November 29, 2025
అమలాపురం: ఎంపీ హరీశ్కు జీవన సాఫల్య పురస్కారం

అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ గౌరవ్ అవార్డు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీకి ఈ అవార్డును అందజేశారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందని, అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ హరీశ్ తెలిపారు.
News November 29, 2025
అమలాపురం: ఎంపీ హరీశ్కు జీవన సాఫల్య పురస్కారం

అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ గౌరవ్ అవార్డు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీకి ఈ అవార్డును అందజేశారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందని, అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ హరీశ్ తెలిపారు.
News November 29, 2025
MBNR: ఓపెన్ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

MBNR జిల్లాలో డా. బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ విధానంలో పీజీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన పీజీ స్పెల్-2 సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి జనవరి 31 వరకు జరుగుతాయని, పరీక్షా రుసుమును www.braouonline.in లో డిసెంబర్ 22 వరకు చెల్లించాలని రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.


