News December 3, 2024
కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే: షర్మిల

వైసీపీ హయాంలో ఆస్తులను లాక్కోవడం ట్రెండ్గా మారితే, వాటిని చూసి మౌనంగా ఉండటం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఆస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గంగవరం పోర్టును గత ప్రభుత్వం అదానీకి రాసిచ్చిందని, తిరిగి వాటాను వెనక్కు తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 30, 2026
కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించాలి: పవన్

AP: కాలుష్యం మన జీవితంలో అంతర్భాగమైందని DyCM పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర పొల్యూషన్ను భరించకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో నివారించలేకున్నా నియంత్రించే ప్రయత్నం చేయాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టాలని చెప్పారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. పరిశ్రమలు 33% గ్రీన్ బెల్ట్ రూల్ పాటించాలని స్పష్టంచేశారు.
News January 30, 2026
సల్మాన్-ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్షిప్పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ ‘రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్, ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తి అని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు.
News January 30, 2026
వెనిజులాతో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ: మోదీ

<<18951392>>వెనిజులా<<>> తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకారం కుదిరినట్లు ఆయన ట్వీట్ చేశారు. అన్నిరంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తామని తెలిపారు. బలమైన దౌత్యం, విజన్తో ఇరు దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రోడ్రిగ్జ్ చెప్పారు.


