News March 16, 2025
భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.
Similar News
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్పూర్లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News March 17, 2025
ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.