News April 29, 2024
ముంబై ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే ఇలా జరగాలి!

ఈసారి ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఆందోళనకరమైన రన్రేట్(-0.261) ఉంది. అయితే మిగిలిన 5 మ్యాచుల్లోనూ గెలిస్తే 16పాయింట్లతో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి. 14పాయింట్లు వస్తే మిగితా జట్ల గెలుపోటములు, రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది.
Similar News
News December 1, 2025
HYD: ఇక పర్యాటక రంగానికి ఏఐ సేవలు

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఏఐ సహాయంతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. టూరిస్టులు చూసే ప్రదేశాలు సమయం చెప్తే దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. దక్కన్ ఎక్స్ప్లోరర్ తన కార్డుతో ఈ సేవలను అందించడానికి రూపకల్పన చేస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో నైట్ టూరిజంను పెంచేందుకు చూస్తోంది.
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.


