News September 10, 2024
ఏపీలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ స్వరూపం ఇదే!

AP: గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి ఐజీ స్థాయి అధికారిని హెడ్గా నియమించి, పోలీస్ స్టేషన్ హోదా కల్పించనుంది. ఈ పీఎస్కు SHOగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి, దీనికి అనుబంధంగా జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ను నెలకొల్పనుంది. అలాగే 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది.
Similar News
News December 22, 2025
ఒక్క క్లిక్తో భూముల సమాచారం: మంత్రి

TG: భూ పరిపాలన వ్యవస్థకు సంబంధించి జనవరిలో ఆధునీకరించిన డిజిటల్ వ్యవస్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి “భూభారతి”తో లింక్ చేస్తాం. ఆధార్తో లింకైన ఫోన్ నంబర్తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్తో భూముల సమాచారం వస్తుంది. సర్వే నంబర్లకు మ్యాప్ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
బిగ్బాస్ విన్నర్ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

నిన్నటితో ముగిసిన బిగ్బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.


