News August 28, 2024
సంక్షోభంలో సంపద సృష్టించుకోవడమంటే ఇదే

ఆగస్టు 5న బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. అప్పటి ప్రధాని హసీనాకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఢాకా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. ఆ సంక్షోభ సమయాన్ని మహమ్మద్ సుమన్(35) అనే వీధి వ్యాపారి అవకాశంగా మలుచుకున్నాడు. నిరసనకారులకు జాతీయ జెండాలు, హెడ్ బ్యాండ్లు అమ్మి భారీ ఆదాయం పొందాడు. భయం వేయలేదా? అని PTI ప్రశ్నించగా ‘ప్రతి ఒక్కరూ ఎప్పుడోసారి చనిపోవాల్సిందే. భయపడటమెందుకు?’ అని చెప్పి ఫేమస్ అయ్యాడు.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


