News August 28, 2024

సంక్షోభంలో సంపద సృష్టించుకోవడమంటే ఇదే

image

ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ అట్టుడికిపోయింది. అప్పటి ప్రధాని హసీనాకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఢాకా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. ఆ సంక్షోభ సమయాన్ని మహమ్మద్ సుమన్(35) అనే వీధి వ్యాపారి అవకాశంగా మలుచుకున్నాడు. నిరసనకారులకు జాతీయ జెండాలు, హెడ్ బ్యాండ్లు అమ్మి భారీ ఆదాయం పొందాడు. భయం వేయలేదా? అని PTI ప్రశ్నించగా ‘ప్రతి ఒక్కరూ ఎప్పుడోసారి చనిపోవాల్సిందే. భయపడటమెందుకు?’ అని చెప్పి ఫేమస్ అయ్యాడు.

Similar News

News September 15, 2025

MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

image

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చేసుకోండి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 18న రాత్రి 11.30 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. యూనివర్సిటీ ఫీజు రూ.12,000 తప్పనిసరిగా చెల్లించాలని పేర్కొంది.

News September 15, 2025

ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

image

AP: 1923 – 2019 వ‌ర‌కు రాష్ట్రంలో 12 మెడిక‌ల్ కాలేజీలుంటే, తమ హ‌యాంలో 17 కాలేజీల‌ను సంక‌ల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల‌ను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిష‌న్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

News September 15, 2025

వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

image

జపాన్‌లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.