News August 28, 2024
సంక్షోభంలో సంపద సృష్టించుకోవడమంటే ఇదే

ఆగస్టు 5న బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. అప్పటి ప్రధాని హసీనాకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఢాకా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. ఆ సంక్షోభ సమయాన్ని మహమ్మద్ సుమన్(35) అనే వీధి వ్యాపారి అవకాశంగా మలుచుకున్నాడు. నిరసనకారులకు జాతీయ జెండాలు, హెడ్ బ్యాండ్లు అమ్మి భారీ ఆదాయం పొందాడు. భయం వేయలేదా? అని PTI ప్రశ్నించగా ‘ప్రతి ఒక్కరూ ఎప్పుడోసారి చనిపోవాల్సిందే. భయపడటమెందుకు?’ అని చెప్పి ఫేమస్ అయ్యాడు.
Similar News
News December 4, 2025
వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.
News December 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు(డేఅండ్నైట్).. బ్రిస్బేన్ వేదికగా మ్యాచ్
➤ ది హండ్రెడ్ లీగ్లో రిలయన్స్ ఎంట్రీ. ఓవెల్ ఇన్విసిబుల్ జట్టులో 49% వాటా కొనుగోలు. టీమ్ పేరు MI లండన్గా మార్పు
➤ నేడు అజిత్ అగార్కర్ బర్త్ డే.. ఆయన పేరు మీదే భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(21 బాల్స్)
➤ ICC వన్డే ర్యాంకింగ్స్లో 5 నుంచి నాలుగో స్థానానికి చేరిన కోహ్లీ.. టాప్ ర్యాంక్లో కొనసాగుతున్న రోహిత్


