News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News November 21, 2025

అండమాన్‌లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News November 21, 2025

మూవీ ముచ్చట్లు

image

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్‌లో టాక్

News November 21, 2025

ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.