News April 25, 2024
ఈసారి ‘పెద్ద సారీ’

తప్పుదోవపట్టించేలా యాడ్స్ ప్రసారం చేయడంపై పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ మరోసారి క్షమాపణలు కోరుతూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఇటీవల పేపర్లో చిన్నగా క్షమాపణ ప్రకటన ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు, యాడ్స్ సైజ్లోనే క్షమాపణలు ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా పతంజలి బేషరతు క్షమాపణలు కోరుతూ పెద్దగా మరోసారి పేపర్లలో ప్రకటన ప్రింట్ చేయించింది.
Similar News
News November 26, 2025
మదనపల్లె కొత్త జిల్లా ఇలా..!

➤జిల్లా కేంద్రం: మదనపల్లె
➤నియోజకవర్గాలు: మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు
➤డివిజన్లు: మదనపల్లె, పీలేరు
➤జనాభా: 11.05 లక్షలు
➤మండలాలు(19): మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, కురబలకోట, ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దమండ్యం, పీటీఎం, కలికిరి, కలకడ, కేవీపల్లె, వాయల్పాడు, గుర్రంకొండ, పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల
News November 26, 2025
వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.
News November 26, 2025
వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.


