News March 31, 2025

ఆ 400 ఎకరాలు మాదే: టీజీ ప్రభుత్వం

image

TG: భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.

Similar News

News November 23, 2025

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

image

జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న G20 సమ్మిట్‌లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.

News November 23, 2025

డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

image

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.

News November 23, 2025

అతి పురాతన నక్షత్రాలను నాసా గుర్తించిందా?

image

బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో ఏర్పడిన పురాతన నక్షత్రాలను NASAకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించినట్టు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో LAP1-B గెలాక్సీలో ఉన్న Population III లేదా POP III అని పిలిచే ఈ స్టార్స్ హైడ్రోజన్, హీలియం తక్కువ ఉండే ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అల్ట్రావయొలెట్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు.