News May 10, 2024

ఆ బాంబు బెదిరింపులు పాక్ నుంచే!

image

అహ్మదాబాద్‌లో స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అవి పాక్‌ నుంచే వచ్చినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. భారతీయుల్లో భయాందోళనల్ని వ్యాప్తి చేసేందుకే నిందితుడు ఇలా చేశాడని తెలిపారు. ‘పాక్‌లోని ఫైసలాబాద్ జిల్లా నుంచి తౌహీద్ లియాఖత్ పేరిట ఓ వ్యక్తి అన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపించాడు. హమాద్ జావేద్ పేరిట మరో ఐడీని కూడా క్రియేట్ చేసి మెయిల్స్ చేశాడు’ అని తెలిపారు.

Similar News

News January 23, 2026

IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

IBPS ఆర్ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 23, 2026

బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

image

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.

News January 23, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

image

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?