News February 11, 2025

ఆ సీసీ కెమెరాలు అధికారులే తొలగించారు: YCP

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్నిప్రమాద ఘటనపై CC ఫుటేజీ ఇవ్వాలన్న పోలీసుల <<15407091>>నోటీసులకు<<>> పార్టీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోడ్డులోని సీసీ కెమెరాలను అధికారులే తొలగించారని తెలిపారు. బారికేడ్లను తీసేసి అన్ని వాహనాలకు అనుమతిచ్చారన్నారు. మాజీ సీఎం జగన్ భద్రతపై అనుమానాలున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్‌గా జో రూట్ ఖాతాలో అన్‌వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.

News December 7, 2025

సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్‌నాథ్ సింగ్

image

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్‌లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్ ఈ కామెంట్లు చేశారు.

News December 7, 2025

YCP ‘కోటి సంతకాలు’లో మార్పులు: సజ్జల

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటన వల్ల 16న గవర్నర్ షెడ్యూల్ మారింది. ఆరోజుకు బదులు 17న పార్టీ చీఫ్ జగన్, నేతలు గవర్నర్‌ను కలుస్తారు. ఇక జిల్లాస్థాయి ర్యాలీలు 13కు బదులు 15న జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. నియోజకవర్గాల్లో నిర్ణీత 10న కార్యక్రమాలు నిర్వహించాలి’ అని చెప్పారు.