News March 21, 2025
కశ్మీర్లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

కశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయి. మేం కశ్మీర్ను విజయవంతంగా భారత్లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
టెన్త్ స్టూడెంట్స్కు మధ్యాహ్న భోజనం

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.
News March 28, 2025
ALERT.. వాకింగ్లో ఇలా చేయకండి

ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్(నడక) చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని తప్పులు చేస్తే గుండెపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ కింది తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు.
* మరీ వేగంగా నడవడం
* వార్మప్ చేయకపోవడం
* వంగి నడవడం
* వాకింగ్ ముందు/తర్వాత నీరు తాగకపోవడం
* అమితంగా తినడం
* కాలుష్య ప్రాంతాల్లో నడవడం
* అతిగా శ్రమించడం
News March 28, 2025
IPL: పాపం కావ్య

సీజన్ తొలి మ్యాచ్లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.