News March 21, 2025
కశ్మీర్లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

కశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయి. మేం కశ్మీర్ను విజయవంతంగా భారత్లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 4, 2026
ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
News January 4, 2026
ఈ అరటి చెట్టు ఎత్తు తక్కువ, లాభం ఎక్కువ

తుఫానులు, తీవ్రగాలుల వల్ల అరటి పంటకు కలిగే నష్టం అపారం. ఈ సమస్యను అధిగమించే పొట్టి అరటి రకం ‘కావేరి వామన్’ను బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), జాతీయ అరటి పరిశోధనా సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ చెట్టు ఎత్తు 4.9 నుంచి 5.25 అడుగులే. దీని వల్ల ఇది గాలులకు విరగదు, ఒరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అరటి దిగుబడి, మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News January 4, 2026
ఈ అరటి చెట్టు ఎత్తు తక్కువ, లాభం ఎక్కువ

తుఫానులు, తీవ్రగాలుల వల్ల అరటి పంటకు కలిగే నష్టం అపారం. ఈ సమస్యను అధిగమించే పొట్టి అరటి రకం ‘కావేరి వామన్’ను బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), జాతీయ అరటి పరిశోధనా సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ చెట్టు ఎత్తు 4.9 నుంచి 5.25 అడుగులే. దీని వల్ల ఇది గాలులకు విరగదు, ఒరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అరటి దిగుబడి, మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


