News April 12, 2025
ఆ రైతులకు ఎకరానికి రూ.10 వేలు

TG: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచే ఈ పరిహారం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొనగా ఈ నెలలో కురిసిన వర్షాలతో అది మరింత పెరిగింది. రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
Similar News
News January 17, 2026
టాస్ ఓడిన భారత్

U-19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. తొలుత భారత్దే బ్యాటింగ్ కావడంతో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, కుందు చెలరేగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
IND: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్, విహాన్, కుందు, చౌహాన్, పంగాలియా, అంబరీష్, హెనిల్, దీపేశ్, ఖిలాన్ పటేల్
News January 17, 2026
మేడారం జాతర.. ఆర్టీసీ ఛార్జీల వివరాలివే

TG: మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే RTC ఎక్స్ప్రెస్ బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు ప్రకటించారు. గోదావరిఖని నుంచి ₹400, హుజూరాబాద్ ₹320, హుస్నాబాద్ ₹350, కరీంనగర్ ₹390, పెద్దపల్లి ₹420, మంథని ₹350, కొత్తగూడెం ₹350, భద్రాచలం- ₹300, మణుగూరు ₹210, ఏటూరునాగారం ₹80, మంగపేట ₹110, పాల్వంచ ₹310, ఖమ్మం ₹480, కాళేశ్వరం ₹360, బెల్లంపల్లి ₹520, ఆసిఫాబాద్ నుంచి ₹590గా ఖరారు చేశారు.
News January 17, 2026
పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.


