News February 18, 2025

సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

image

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.

Similar News

News February 20, 2025

టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్.. బంగ్లాకు వరం!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఘోరమైన ఫీల్డింగ్ చేస్తోంది. అక్షర్ బౌలింగ్‌లో రోహిత్ ఓ క్యాచ్, జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ స్టంపింగ్ మిస్, శ్రేయస్ అయ్యర్ రనౌట్ ఛాన్స్ మిస్, కుల్దీప్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఓ క్యాచ్ మిస్ చేశారు. దీంతో బంగ్లా బ్యాటర్లు బతికిపోయారు. టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా బంగ్లా 35/5 దశ నుంచి 120/5తో కోలుకుంది.

News February 20, 2025

యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC

image

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని APPSC ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈనెల 23న 10am-12.30pm పేపర్-1, 3pm-5.30pm పేపర్-2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100m పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 20, 2025

కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమే: ఉత్తమ్

image

TG: నీటి పారుదల రంగాన్ని నాశనం చేసిన ఘనత BRSదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని, జేబులు నింపుకొనేందుకే నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనన్నారు. మరోవైపు రాష్ట్రంలోని జల అవసరాలపై కేంద్రంతో చర్చించామని ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణ జలాల్లో AP దోపిడీని కేంద్రానికి వివరించామని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరామని చెప్పారు.

error: Content is protected !!