News February 18, 2025
సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
Similar News
News December 22, 2025
పాస్టర్లకు గౌరవ వేతనం మేమే ప్రారంభించాం: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరి కోసం పనిచేస్తుందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం తామే ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 24న రూ.50కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రైస్తవ సంస్థలు విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయని, NTR కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారని CM గుర్తుచేశారు.
News December 22, 2025
హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన LIC

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. <<18548745>>RBI రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో ఆ మేర తాము కూడా రుణ రేట్లను సవరించినట్లు వెల్లడించింది. కొత్తగా హోం లోన్ తీసుకునేవారికి వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
News December 22, 2025
AIపై పిల్లలతో పేరెంట్స్ చర్చించాలి: ఎక్స్పర్ట్స్

AI టెక్నాలజీపై పిల్లలతో పేరెంట్స్ ఓపెన్గా మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘దాని లిమిటేషన్స్పై చర్చించాలి. స్కూళ్లలో సబ్జెక్టుల్లోనూ వాటిని చేర్చాలి. AI చెప్పింది ఫాలో కాకుండా ప్రశ్నించడం ఎంత ముఖ్యమో తెలపాలి. డేటా ప్రైవసీ, ఎథిక్స్, రెస్పాన్సిబుల్గా AIను ఎలా ఉపయోగించాలో చెప్పాలి. క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్లో టెక్నాలజీని బ్యాలెన్స్ చేసుకునే నైపుణ్యాలపై చర్చించాలి’ అని చెబుతున్నారు.


