News July 29, 2024
ఆ గిరిజనులు చాలా గ్రేట్: ప్రధాని మోదీ

APలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధాని మోదీ అభినందించారు. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవల గురించి ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారని మన్కీబాత్లో వెల్లడించారు. టైగర్ ట్రాకర్స్గా వారు పనిచేస్తున్నారని, వన్యప్రాణుల ప్రతి చిన్న కదలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపైనా నిఘా ఉంచినట్లు మోదీ వివరించారు.
Similar News
News October 15, 2025
డేటా సెంటర్కు నీరెందుకు అవసరం?

డేటా సెంటర్లలోని వేలాది సర్వర్లు, స్టోరేజీ డివైజులు, నెట్వర్కింగ్ పరికరాలు 24/7 రన్ అవుతాయి. దీంతో అధిక టెంపరేచర్ జనరేట్ అవుతుంది. వాటిని <<18016110>>కూల్<<>> చేయకపోతే హార్డ్వేర్ ఫెయిల్ కావడంతో పాటు అగ్నిప్రమాదాలూ జరగొచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్ మెగావాట్ల విద్యుత్, రోజుకు లక్ష నుంచి 5 లక్షల గ్యాలన్ల నీటిని వాడుకుంటుంది. చిల్లర్స్, లిక్విడ్ కూలింగ్, నీటి ఆవిరి, కూలింగ్ టవర్లు ఉపయోగించి వాటిని కూల్ చేస్తారు.
News October 15, 2025
IPS పూరన్ సూసైడ్: ట్విస్టులెన్నో.. (1/2)

TGకి చెందిన హరియాణా IPS అధికారి <<18001541>>పూరన్<<>> సూసైడ్ వెనుక ఎన్నో ట్విస్టులు. IT కథనం ప్రకారం.. రోహతక్ IGగా ఉన్న పూరన్ను PTCకి బదిలీ చేశారు. దీంతో సెలవు పెట్టి PSO సుశీల్తో కలిసి చండీగఢ్కు బయలుదేరారు. మధ్యలో ASI సందీప్ టీమ్ ఆ కారును ఆపి సుశీల్ను అదుపులోకి తీసుకుంది. ‘తర్వాత నీ వంతే’ అని పూరన్ను బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కోసం సుశీల్పై ఒత్తిడి చేసి వారం తర్వాత ACB కేసుపెట్టింది.
News October 15, 2025
IPS పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ట్విస్టులెన్నో.. (2/2)

వీటిపై పూరన్ DGP, SPకి కాల్ చేసినా స్పందన లేదు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకోగా భార్య కేసు పెట్టారు. మృతికి కులవివక్ష కారణమన్న విమర్శలు రేగడంతో DGP, SPని మార్చారు. ఈక్రమంలో పూరన్ అవినీతిపరుడని వీడియో తీసి ASI సందీప్ మరణించడం కలకలం రేపింది. గ్యాంగ్స్టర్ ఇందర్జిత్తో పూరన్కు ఆర్థిక ఒప్పందాలున్నట్లు అతడు ఆరోపించాడు. కులవివక్ష అంశంగా ఉన్న కేసు ఇప్పుడు అవినీతి, పోలీసులు-నేరగాళ్ల బంధం దిశగా మళ్లింది.