News July 29, 2024

ఆ గిరిజనులు చాలా గ్రేట్: ప్రధాని మోదీ

image

APలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధాని మోదీ అభినందించారు. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవల గురించి ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారని మన్‌కీబాత్‌లో వెల్లడించారు. టైగర్ ట్రాకర్స్‌గా వారు పనిచేస్తున్నారని, వన్యప్రాణుల ప్రతి చిన్న కదలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపైనా నిఘా ఉంచినట్లు మోదీ వివరించారు.

Similar News

News November 23, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News November 23, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్‌మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్‌‌లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు

News November 23, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/