News April 3, 2025
వైఎస్ సునీత ప్రాణాలకు ముప్పు.. షర్మిల సంచలన ఆరోపణలు

AP: వివేకా హత్య కేసు నిందితులు ఆయన కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎంపీ అవినాశ్ బెయిల్పై ఉన్నందునే ఆమెకు న్యాయం జరగట్లేదన్నారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇలాగైతే న్యాయం ఎప్పుడు జరుగుతుందని న్యాయస్థానాలను ప్రశ్నించారు.
Similar News
News April 9, 2025
ఈరోజు ఎన్టీఆర్-నీల్ మూవీపై అప్డేట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు తీసిన నీల్ తమ హీరోను ఎలా చూపిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్గా ఎదురుచూస్తున్నారు. వారికి మూవీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్డేట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది.
News April 9, 2025
ధోనీ ఔటయ్యారని భోరున విలపించింది!

పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News April 9, 2025
రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.