News January 13, 2025

‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు

image

‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News December 25, 2025

రేవంత్ పేరెత్తని కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?

image

TG: KCR ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూ సుదీర్ఘంగా మాట్లాడారు. తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరు ఎత్తలేదు. అలాంటిది అసెంబ్లీలో CM ఎదుట ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి ఇష్టపడతారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు KCR అసెంబ్లీకి వెళ్లి పాలమూరు-రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారనే టాక్ BRS పార్టీలో విన్పిస్తోంది. దీనిపై క్లారిటీ కోసం <<18664624>>29వ తేదీ<<>> వరకు వేచి చూడాల్సిందే.

News December 25, 2025

NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>NCERT <<>>173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 నుంచి జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in

News December 25, 2025

తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

image

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.