News March 16, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు

వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.
Similar News
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT
News November 24, 2025
ఇక సెలవు.. ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి

బాలీవుడ్ నటుడు <<18374925>>ధర్మేంద్ర<<>> (89) అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీతారలు, అభిమానులు భారీగా వచ్చారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ తదితర సినీ తారలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తుది నివాళులు అర్పించారు.


