News March 16, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు

వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.
Similar News
News March 3, 2026
‘హార్ముజ్’ బంద్.. మనకు ఆయిల్ ఎలా..?

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19288027>>మూసేయడం<<>> తెలిసిందే. దీంతో దిగుమతులకు అంతరాయం కలిగితే మనపై పడే ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. ఇండియా రోజూ 5 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంటుండగా, ఈ జలసంధి గుండా 2.5MB వస్తోంది. ప్రస్తుతం మన వద్ద 40-45 రోజులకు సరిపడా స్టాక్ ఉన్నట్లు ‘Kpler’ చెప్పింది. స్టోరేజీ ట్యాంకులు, రిజర్వులు, దేశం వైపు వచ్చే నౌకల్లో 100 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ నిల్వ ఉన్నట్లు తెలిపింది.
News March 3, 2026
మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయకండి: హీరోయిన్

నటీమణులను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయడంపై ‘కాంతార’ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారులను అభ్యంతరకర యాంగిల్స్లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. ఫీమేల్ యాక్టర్స్ శరీర భాగాలను జూమ్ చేసి ఫొటోలు తీస్తూ వాటిని SMలో పోస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి పనులు మానుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని ఆమె డిమాండ్ చేశారు.
News March 3, 2026
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ‘కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా టెహ్రాన్లోని ప్రభుత్వ లీడర్షిప్ కాంపౌండ్పై అటాక్ చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్పై బాంబులు వేశాం’ అని ఓ ప్రకటనలో IDF తెలిపింది.


