News October 14, 2024

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

image

ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డారెన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్‌సన్ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన అధ్యయనానికి గానూ వీరికి పురస్కారం దక్కిందని తెలిపింది.

Similar News

News January 17, 2026

నగలు సర్దేయండిలా..

image

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.

News January 17, 2026

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<>NML<<>>) 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT)ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.36వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News January 17, 2026

తిరుమల సప్తగిరులకు ఆ పేర్లెలా వచ్చాయంటే..?

image

తిరుమలలోని 7 కొండలకు విశిష్టమైన చరిత్ర ఉంది. శ్రీవారి ఆజ్ఞతో గరుత్మంతుడు తెచ్చిన గరుడాద్రి, వృషభాసురుడి పేరున వృషభాద్రి, అంజనీదేవి తపస్సు చేసిన అంజనాద్రి ప్రధానమైనవి. తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరుతో నీలాద్రి, ఆదిశేషుడి పేరిట శేషాద్రి, పాపాలను దహించే వేంకటాద్రి, నారాయణుడు తపస్సు చేసిన నారాయణాద్రిగా నేడు వీటిని పిలుస్తున్నారు. ఈ ఏడు కొండలు భక్తికి, ముక్తికి నిలయాలు.