News May 19, 2024
రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మరణించారు. కాగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది.
Similar News
News December 23, 2025
పవన్ ఓ కాగితం పులి: బొత్స

AP: మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నదే తమ విధానమని YCP నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరిట అక్రమాలు చేసిన వారందరిపై చర్యలు తప్పవన్నారు. పవన్ కాగితం పులి అని, సినిమా డైలాగ్లు, పీకుడు భాష కట్టిపెట్టాలన్నారు. ‘కోటి సంతకాలు ఎవరు పెట్టారని మంత్రి సత్యకుమార్ అంటున్నారు. మీ గ్రామానికి వెళ్లి ప్రైవేటీకరణకు అభ్యంతరముందా అని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’ అని సూచించారు.
News December 23, 2025
DEC 31: అర్ధరాత్రి దాకా వైన్స్.. 1AM వరకు బార్స్

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో DEC 31న మద్యం షాపులు అర్థరాత్రి గం.12am వరకు తెరిచేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక బార్స్, క్లబ్స్, పర్మిషన్ గల ఈవెంట్స్, టూరిజం ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి 1am వరకు వీలు కల్పించింది. అటు బయటి రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం రవాణాపై నిఘా పెట్టామని తెలిపింది. గంజాయి, డ్రగ్స్, నాటుసారాలపై స్పెషల్ టీంలతో దాడులు జరుపుతామని వెల్లడించింది.
News December 23, 2025
శివాజీ కామెంట్స్.. మహిళా కమిషన్ వార్నింగ్!

సినీ వేడుకల్లో యాక్టర్లు జాగ్రత్తగా మాట్లాడాలని TG మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. మహిళల్ని అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్పై <<18648181>>వివాదాస్పద కామెంట్స్<<>> చేసిన శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను లీగల్ టీమ్ పరిశీలించిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ ‘MAA’ ప్రెసిడెంట్కు TFI వాయిస్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లేఖ రాసింది.


