News February 28, 2025

కోహ్లీ ముంగిట మూడు రికార్డులు!

image

CTలో భాగంగా ఎల్లుండి న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచులోనూ కోహ్లీ సెంచరీ చేస్తే ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(52) చేసిన బ్యాటర్‌గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51, కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలతో టాప్‌లో ఉన్నారు. 51 రన్స్ చేస్తే భారత్ తరఫున CTలో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలుస్తారు. అలాగే 85 రన్స్ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి NZపై 3వేల రన్స్ చేసిన ప్లేయర్‌గా అరుదైన క్లబ్‌లో విరాట్ చేరుతారు.

Similar News

News March 1, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
* మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు
* బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స
* రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్
* ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు
* టన్నెల్‌లో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది: కలెక్టర్
* CT: సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

News March 1, 2025

గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

image

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News March 1, 2025

నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

image

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

error: Content is protected !!