News June 26, 2024

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

image

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. డోడా జిల్లాలో ముష్కరుల కదలికలపై సమాచారం రావడంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి. ఈక్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోనూ ఏరివేత ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 24, 2025

శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

image

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News November 24, 2025

IIT ధన్‌బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

image

<>IIT<<>> ధన్‌బాద్ 105 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్సీలకు 32, ఎస్టీలకు 20, ఓబీసీలకు 53 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ /డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iitism.ac.in

News November 24, 2025

జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్‌తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సైతం ఈ వివరాలు పంపింది.