News August 29, 2024
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్ కుంకడి, కర్నాహ్లో ఉగ్రవాదుల చొరబాట్ల సమాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎదురు కాల్పులు కొనసాగాయి. కూంబింగ్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు.
Similar News
News March 3, 2026
BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.
News March 2, 2026
ప్రధాని పదవిపై తొలిసారి రాహుల్ సానుకూల సంకేతాలు!

TG: ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి రాహుల్ గాంధీ సానుకూల సంకేతాలు ఇచ్చారు. వికారాబాద్లో జరిగిన DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ‘ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే’ అని సీఎం రేవంత్ కోరారు. అందుకు స్పందించిన రాహుల్ ‘మోదీపై యుద్ధానికి సిద్ధం’ అని తల ఊపుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని రేవంత్ తెలిపారు.
News March 2, 2026
భీకర దాడి జరగబోతోంది.. ప్రజలు బయటకు రావొద్దు: ట్రంప్

ఇరాన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘మా సైన్యం ఇరాన్ నుంచి చెత్తను తొలగిస్తోంది. మేమింకా భారీస్థాయిలో దాడి చేయలేదు. త్వరలో భీకర దాడి జరగబోతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. బయట సేఫ్ కాదు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం నాకూ ఇష్టం లేదు. 4 వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నా. ఇరాన్ ప్రజలు తమ దేశంపై నియంత్రణ సాధించాల్సిందే. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని CNNతో తెలిపారు.


