News August 29, 2024
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్ కుంకడి, కర్నాహ్లో ఉగ్రవాదుల చొరబాట్ల సమాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎదురు కాల్పులు కొనసాగాయి. కూంబింగ్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు.
Similar News
News March 3, 2026
నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.
News March 3, 2026
తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.
News March 3, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.


