News May 21, 2024
ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

AP: పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
ఫ్రీగా విద్య, వైద్యం మాత్రమే ఇవ్వాలి: వెంకయ్య నాయుడు

విద్య, వైద్యం తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ బస్సులు ఇవ్వమని ఎవరు అడిగారు. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. వాటిని ఆపేసి.. కష్టపడేవారికి చేయూతనివ్వాలి” అని అన్నారు.
News December 23, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భారీ జీతంతో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో(<
News December 23, 2025
విష్ణు సహస్రనామం: శ్రీనివాసుడి దివ్య లక్షణాలు

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః |
నిమిషోనిమిషస్స్రగ్వీ వాచస్పతిరుదారధీః ||
సమస్త విద్యలను బోధించే ఆదిగురువు, గురువులకే గురువు, సత్యమే రూపంగా, పరాక్రమంగా వెలిగే జ్యోతిస్వరూపుడు విష్ణు. భక్తులను ఎప్పుడూ రక్షించే నిరంతర జాగ్రత్తా రూపుడు. వైజయంతీమాలను ధరించిన ఆ వాచస్పతి, మనలో ఉదారమైన బుద్ధిగా ఉండి నడిపిస్తాడు. ఇటువంటి దివ్య గుణాలను స్మరిస్తే మనలో సద్బుద్ధి, జ్ఞానం పెరుగుతాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


