News November 24, 2024

CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’

image

మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్‌ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్‌ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.

Similar News

News December 4, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్‌(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్

News December 4, 2025

రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్‌

image

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్‌మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

News December 4, 2025

Dec 11న మిస్సైల్ టెస్ట్.. NOTAMకు కేంద్రం నోటీస్

image

విశాఖ తీరంలో మిస్సైల్ పరీక్ష పరిధిని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీకు కేంద్రం విస్తరించింది. DEC 11న మిస్సైల్ పరీక్ష నిర్వహించనున్నట్టు NOTAMకు తెలిపింది. డిసెంబర్ 1-4 మధ్య నిర్వహించే టెస్ట్‌కు 3,485 కి.మీలు డేంజర్ జోన్‌గా గుర్తించాలని నోటీసులిచ్చిన కేంద్రం తర్వాత కాన్సిల్ చేసింది. ATC, రన్ వే రిపేర్లు, ఎయిర్‌స్పేస్ క్లోజింగ్స్, విమాన కార్యకలాపాలు, భద్రతా పర్యవేక్షణలో NOTAMs కీలకంగా పనిచేస్తాయి.