News October 21, 2024
తుఫాను ముప్పు.. భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Similar News
News October 21, 2024
నేడు కోర్టుకు నందిగం సురేశ్
AP: వైసీపీ నేత నందిగం సురేశ్ను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. 2020లో జరిగిన ఘర్షణల విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారు. రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టుకు తీసుకొస్తున్నారు. కాగా విచారణలో తేలిన అంశాల ఆధారంగా త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
News October 21, 2024
STOCK MARKETS: నేడెలా ఆరంభం కావొచ్చంటే!
బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, తైవాన్, కోస్పీ, జకార్తా సూచీలు మెరుగ్గా ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. OCTలో FIIలు రూ.80,217 కోట్లను వెనక్కి తీసుకున్నారు. DIIలు రూ.74,176 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే నెట్ లాస్ తక్కువగానే ఉంది. కంపెనీల రిజల్ట్స్ను బట్టి సూచీల కదలిక ఉంటుంది.
News October 21, 2024
డయేరియా బాధితులను పరామర్శించనున్న పవన్
AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారు.