News April 24, 2024
ముంబైకి అండగా తిలక్ వర్మ

ముంబై ఇండియన్స్ టీమ్కు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అండగా నిలుస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ టీమ్ను గౌరవప్రదమైన స్థానంలో నిలుపుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా 25, 64, 32, 6, 16*, 31, 34*, 65 రన్స్ చేసిన 21 ఏళ్ల వర్మ.. ముంబైకి బ్యాక్ బోన్గా మారారు. బ్యాటింగ్లో మంచి టచ్లో ఉన్న తిలక్ను T20WC కోసం భారత జట్టుకు ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News February 2, 2026
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు FEB 25 వరకు గడువు

JEE మెయిన్ తుది విడత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్నాయి. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగిశాయి. వీటి ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు వెల్లడించనున్నారు.
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.
News February 2, 2026
హైదరాబాద్లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


