News September 20, 2025
పసుపులో నత్రజని లోపం నివారణకు సూచనలు

పసుపు పంటలో నత్రజని లోపాన్ని నివారించడానికి.. సాగు సమయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని బయటకు పంపేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ నిపుణుల సూచనలతో సమతుల సమగ్ర ఎరువులు వాడాలి. లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, 1/2 మి.లీ జిగురు మందును కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపు విత్తిన వెంటనే మల్చింగ్ చేయడం మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News September 20, 2025
భారత్-పాక్ మ్యాచ్కు రిఫరీగా మళ్లీ ఆయనే!

ASIA CUP: సూపర్-4లో రేపు భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్కు <<17756416>>ఆండీ పైక్రాఫ్ట్<<>> రిఫరీగా వ్యవహరించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు ఆడిన తొలి మ్యాచ్లో ఆయనే రిఫరీగా ఉండగా హ్యాండ్ షేక్ వివాదం తలెత్తింది. ఆండీని తొలగిస్తేనే టోర్నీలో కొనసాగుతామని ICCకి PCB ఫిర్యాదు చేసి భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనే రిఫరీగా వస్తే పాక్కు మానసికంగా పెద్ద దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 20, 2025
వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.
News September 20, 2025
RITESలో 27 పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(<