News August 28, 2024
కలలు గుర్తుంచుకోవడానికి చిట్కాలు!

కలలు ముక్కలుగా, అస్పష్టంగా గుర్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కల మొత్తం గుర్తుండే ఛాన్స్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు 3పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే రాత్రి మూడునాలుగుసార్లు మెలకువ వస్తుంది. నిద్ర సైకిల్స్ తక్కువగా ఉండటంతో ఆ గ్యాప్లో వచ్చిన కల గుర్తుండే ఛాన్స్ ఉందంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే కదలకుండా కాసేపు కళ్లు మూసుకున్నా కలలు గుర్తుంటాయంటున్నాయి. మీరూ ట్రై చేసి చెప్పండి.
Similar News
News February 3, 2026
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.
News February 3, 2026
అందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారు: రాహుల్

ప్రధాని మోదీ తన ఇమేజ్ పోతుందనే భయపడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. USలో అదానీ గ్రూప్పై ఉన్న కేసు నిజానికి మోదీ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసేందుకు పెట్టినదని ఆరోపించారు. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలోనూ మోదీ ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయని.. వాటిని ఇంకా US రిలీజ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రధాని భయంతో ఉన్నారని ఆరోపించారు.
News February 3, 2026
8 మంది ఎంపీల సస్పెన్షన్.. లోక్సభ రేపటికి వాయిదా

విపక్ష ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. తనపై పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సెషన్ మొత్తం వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు.


