News August 28, 2024
కలలు గుర్తుంచుకోవడానికి చిట్కాలు!

కలలు ముక్కలుగా, అస్పష్టంగా గుర్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కల మొత్తం గుర్తుండే ఛాన్స్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు 3పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే రాత్రి మూడునాలుగుసార్లు మెలకువ వస్తుంది. నిద్ర సైకిల్స్ తక్కువగా ఉండటంతో ఆ గ్యాప్లో వచ్చిన కల గుర్తుండే ఛాన్స్ ఉందంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే కదలకుండా కాసేపు కళ్లు మూసుకున్నా కలలు గుర్తుంటాయంటున్నాయి. మీరూ ట్రై చేసి చెప్పండి.
Similar News
News January 13, 2026
విజయ్కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.
News January 13, 2026
భోగి మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలి: CM

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News January 13, 2026
రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.


