News August 28, 2024
కలలు గుర్తుంచుకోవడానికి చిట్కాలు!

కలలు ముక్కలుగా, అస్పష్టంగా గుర్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కల మొత్తం గుర్తుండే ఛాన్స్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు 3పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే రాత్రి మూడునాలుగుసార్లు మెలకువ వస్తుంది. నిద్ర సైకిల్స్ తక్కువగా ఉండటంతో ఆ గ్యాప్లో వచ్చిన కల గుర్తుండే ఛాన్స్ ఉందంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే కదలకుండా కాసేపు కళ్లు మూసుకున్నా కలలు గుర్తుంటాయంటున్నాయి. మీరూ ట్రై చేసి చెప్పండి.
Similar News
News January 8, 2026
ప్రభుత్వ ప్రకటనల్లో నాయకుల ఫొటోలు.. జోక్యానికి హైకోర్టు నిరాకరణ

AP: ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకే వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి కొండలరావు ఈ పిల్ను దాఖలు చేశారు.
News January 8, 2026
మిరప పంటకు తెగుళ్ల ముప్పు.. నివారణ ఎలా?

చలి తీవ్రత కారణంగా మిరప పంటలో తెగుళ్ల ముప్పు పెరిగింది. ముఖ్యంగా నల్లతామర పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా మొక్కల ఆకులు, కాయలు రాలి, పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతున్నాయి. నల్ల తామర పురుగులతో పాటు బూడిద తెగులు, పూత, కాయతొలుచు పురుగుల ఉద్ధృతి కూడా పెరిగింది. వీటి నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 8, 2026
నేడు YS జగన్ మీడియా సమావేశం

AP: YCP అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.


