News September 2, 2025

తిరుమల బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ ఇదే

image

AP: తిరుమలలో ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 23న సాయంత్రం మీన లగ్నంలో అంకురార్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. నిత్యం ఉదయం 8-10 గంటల వరకు, సాయంత్రం 7-9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. 25, 26, 27 తేదీల్లో మధ్యాహ్నం 1-3 గంటల వరకు స్నపన తిరుమంజసం నిర్వహిస్తారు. 28న గరుడసేవ, 29న స్వర్ణ రథోత్సవం, OCT 1న మహా రథోత్సవం, 2న చక్రస్నానం ఉంటాయి.

Similar News

News September 22, 2025

INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

image

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్‌ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.

News September 22, 2025

అటుకుల బతుకమ్మ ఎలా జరపాలి?

image

బతుకమ్మ పండుగలో రెండో రోజును ‘అటుకుల బతుకమ్మ’ అని అంటారు. ఈ రోజున బతుకమ్మను గునుగు, తంగేడు, నందివర్ధనం, బంతి, చామంతి, గుమ్మడి, బీర పూలతో పేర్చి, వాటిపై గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. అటుకులు, బెల్లం, చప్పిడి పప్పులను నైవేద్యంగా సమర్పించి, వాటిని పిల్లలకు పంచిపెట్టాలి. ఈ నైవేద్యం పిల్లలకు ఇష్టం కాబట్టే ఈ రోజుకు ‘అటుకుల బతుకమ్మ’ అనే పేరు వచ్చిందని నమ్మకం. ఈరోజే దేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి.

News September 22, 2025

జీఎస్టీ ఎఫెక్ట్.. రూ.85వేల వరకు తగ్గిన ధరలు

image

టీవీలపై జీఎస్టీ శ్లాబు మార్పుతో పలు కంపెనీలు రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. టూవీలర్స్‌లో రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.